వైరస్తో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేం?
ABN , First Publish Date - 2020-06-22T09:32:27+05:30 IST
కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర సర్కారులు పరస్పరం విమర్శించుకుంటూ ..

ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర సర్కారులు పరస్పరం విమర్శించుకుంటూ మభ్యపెడుతున్నాయని ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం విమర్శించింది. కరోనా మరణాలు పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గచ్చిబౌలిలోని టిమ్స్ను ఇంకా ప్రారంభించకపోవడం చాలా బాధాకరమని చెప్పారు.