గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ గురించి కొత్త చర్చ!

ABN , First Publish Date - 2020-12-05T08:56:19+05:30 IST

బీజేపీయేతర సీఎంలతో కేసీఆర్‌ తలపెట్టిన సదస్సు ప్రకటించిన విధంగానే డిసెంబర్‌ రెండో వారంలోనే జరుగుతుందా? జీహెచ్‌ఎంసీ ఫలితాల

గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ గురించి కొత్త చర్చ!

  • బీజేపీయేతర సీఎంల సదస్సు జరిగేనా?

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): బీజేపీయేతర సీఎంలతో కేసీఆర్‌ తలపెట్టిన సదస్సు ప్రకటించిన విధంగానే డిసెంబర్‌ రెండో వారంలోనే జరుగుతుందా? జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో వాయిదా పడనుందా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఇది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు.


దీనిపై బీజేపీయేతర పార్టీల సీఎంలతో హైదరాబాద్‌లో డిసెంబర్‌ రెండో వారంలో సదస్సు నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ నుంచి పార్టీ నేతలంతా ప్రచారంలో మునిగి పోయారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో సంప్రదింపుల ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదని తెలుస్తోంది.

Updated Date - 2020-12-05T08:56:19+05:30 IST