నేడు ప్రజావాణి రద్దు
ABN , First Publish Date - 2020-03-02T11:21:24+05:30 IST
నేడు ప్రజావాణి రద్దు

వరంగల్ రూరల్ కలెక్టరేట్, మార్చి1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కారణంగా (సోమవారం) గ్రీవెన్స్ సెల్ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా, ఇతర అధికారులు పాల్గొంటునందున గ్రీవెన్స్ నిర్వహణ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని ప్రకటనలో పేర్కొన్నారు.