గ్రూప్-4కు మళ్లీ వెబ్ ఆప్షన్లు
ABN , First Publish Date - 2020-06-23T09:48:07+05:30 IST
తెలంగాణలో గ్రూప్-4 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మళ్లీ వెబ్ ఆప్షన్ ఇవ్వాలని టీఎ్సపీఎస్సీ తెలిపింది. మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు జిల్లాల వారీగా పోస్టులను ఎంపిక

హైదరాబాద్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గ్రూప్-4 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మళ్లీ వెబ్ ఆప్షన్ ఇవ్వాలని టీఎ్సపీఎస్సీ తెలిపింది. మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు జిల్లాల వారీగా పోస్టులను ఎంపిక చేసుకోవాలని పేర్కొంది. గతంలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయి వెబ్ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు.. మళ్లీ కొత్తగా ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. గతంలో ఇచ్చిన వివరాలను రద్దు చేస్తున్నామని వివరించింది. అభ్యర్థులు తాజా వెబ్ఆప్షన్లో నమోదు చేసిన వివరాల ఆధారంగానే ఉద్యోగాల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.