సూర్యాపేట ఎస్పీకి హెచ్చార్సీ నోటీసులు
ABN , First Publish Date - 2020-04-21T08:35:36+05:30 IST
సూర్యాపేట ఎస్పీ, డీఎంహెచ్వోకు మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) నోటీసులిచ్చింది.

సూర్యాపేట ఎస్పీ, డీఎంహెచ్వోకు మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) నోటీసులిచ్చింది. ఇటీవల నడిరోడ్డుపై గర్భిణి ప్రసవించిన ఘటనపై మే 22లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. వైద్యులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే సూర్యాపేటలో రేష్మ అనే గర్భిణి నడిరోడ్డుపైన ప్రసవించిందని జయ వింధ్యాల అనే న్యాయవాది ఈమెయిల్లో ఫిర్యాదు చేశారు.