ఈసెట్‌లో మెరిసిన వరంగల్‌ విద్యార్థులు

ABN , First Publish Date - 2020-09-12T08:06:38+05:30 IST

ఈసెట్‌ ఫలితాల్లో వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులు రాష్ట్ర

ఈసెట్‌లో మెరిసిన  వరంగల్‌ విద్యార్థులు

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 11: ఈసెట్‌ ఫలితాల్లో వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మొదటి, ద్వితీయ ర్యాంకులు సాధించారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో నీలం దివ్యశ్రీ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు.  మెకానికల్‌లో సాయికిషోర్‌ మొదటి ర్యాంకు, రంగరాజు చంద్రమహేష్‌ రెండో ర్యాంకు సాధించారు.


ఈఈఈ విభాగంలో ఎండీ రుఖియా మొదటి ర్యాంకు సాధించగా, జి.సుమంత్‌ నాలుగో, జి.అశ్విని ఆరో ర్యాంకు దక్కించుకున్నారు.

ఆసిఫాబాద్‌కు చెందిన పైడాకుల సాయివర్షన్‌ మైనింగ్‌ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు.

Updated Date - 2020-09-12T08:06:38+05:30 IST