వరంగల్ ఘటన : అంత్యక్రియలు వాయిదా
ABN , First Publish Date - 2020-05-24T12:24:27+05:30 IST
గీసుగొండ శివారులో గల పాడుబడిన బావిలో లభించిన తొమ్మిది మంది

వరంగల్ /హన్మకొండ అర్బన్ : గీసుగొండ శివారులో గల పాడుబడిన బావిలో లభించిన తొమ్మిది మంది మృతదేహాల అంత్యక్రియలను అధికారులు వాయిదా వేశారు. శుక్రవారం రాత్రి ఎంజీఎం మార్చురిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయినప్పటికీ అంత్యక్రియలు నిర్వహించలేదు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఉండటం, వారికి స్థానికంగా బంధువులు లేకపోవడం, మిగిలిన వారి కుటుంబ సభ్యులు సైతం ఆర్థిక స్థోమత లేని కారణంగా అంత్యక్రియలు ప్రభుత్వాన్నే నిర్వహించాలని కోరడంతో మృతదేహాలను గీసుకొండ తహసిల్దార్కు అప్పగించడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇంతలో ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ నిమిత్తం మృత దేహాలను భద్రపరచాలని ఆదేశాలివ్వటంతో ఫ్రీజర్లలోనే ఉంచారు.