కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
ABN , First Publish Date - 2020-09-06T14:43:59+05:30 IST
భీమారం మండలం, కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలంరేపుతోంది.
మంచిర్యాల జిల్లా: భీమారం మండలం, కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో రెండు పశువులు మృతి చెందాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. కే4 పులిగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.