సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారు: విజయశాంతి

ABN , First Publish Date - 2020-11-27T15:51:52+05:30 IST

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించింది.

సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారు: విజయశాంతి

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించింది. ఎంఐఎం పార్టీతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను చివరి క్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఎంఐఎం నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చేయకపోగా నిలదీసిన పార్టీలపై పోలీసు బలగాలను వినియోగిస్తున్నారని విజయశాంతి విమర్శించారు.

 

‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను చివరి క్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎంఐఎం నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యకపోగా ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయి.


ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు... క్షమించదు’’ అని విజయశాంతి పేర్కొన్నారు.


Updated Date - 2020-11-27T15:51:52+05:30 IST