రాజకీయాలకు విలువలు అద్దిన రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి-ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-08-16T20:57:00+05:30 IST

రాజకీయాలకు విలువలు అద్దిన రాజనీతిజ్ఞుడు అటల్‌బిహారీవాజ్‌పేయి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

రాజకీయాలకు విలువలు అద్దిన రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి-ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాజకీయాలకు విలువలు అద్దిన రాజనీతిజ్ఞుడు అటల్‌బిహారీవాజ్‌పేయి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన జనహృదయాల్లో చిరస్థాయిలో నిలిచి పోతారని అన్నారు. భారత మాజీ ప్రధాన మంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా వెంకయ్యనాయుడు ట్వీట్‌చేస్తూ ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. సుపరిపాలనా దక్షుడిగా, అనుసంధాన విప్లవ మార్గదర్శిగా విలువలతోకూడిన రాజకీయాలను నెరపిన మంచి వ్యక్తిగా అభివర్ణించారు. మాటల్లోచెప్పే విలువలను స్వయంగా పాటించే లక్షణమే వారిని ఆదర్శనాయకునిగా నిలిపిందని చెప్పారు. వ్యక్తిత్వం, మితృత్వం, కర్తృత్వం, నేతృత్వాల కలయిక అయిన అటల్‌జీ నిజమైన ‘భారత రత్నం’. ఆయన క్రమశిక్షణ, చిత్తశుద్ధి, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. 

Updated Date - 2020-08-16T20:57:00+05:30 IST