తెలంగాణలో ఎన్‌హెచ్ విస్తరణకు కేంద్రం ఆమోదం: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-17T22:56:24+05:30 IST

తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు

తెలంగాణలో ఎన్‌హెచ్ విస్తరణకు కేంద్రం ఆమోదం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈనెల 21న కేంద్రమంత్రి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణలో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 750 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేస్తే.. పెండింగ్‌లో ఉన్న వాటికి కేంద్రం అనుమతిస్తుందన్నారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌రోడ్డుకు త్వరలో అనుమతి లభించనుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-17T22:56:24+05:30 IST