నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి పరామర్శ

ABN , First Publish Date - 2020-12-12T02:33:09+05:30 IST

నకిరేకల్‌లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి పరామర్శ

నల్గొండ: నకిరేకల్‌లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. నకిరేకల్‌లోని నోముల నివాసంలో ఆయన చిత్ర పటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి ఓదార్చారు. అంతకముందు తిరుమలగిరి, అర్వపల్లిలో సాయిబాబా దేవాలయంలో కిషన్‌రెడ్డి పూజలు నిర్వహించారు.


పరామర్శ అనంతరం కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..
‘ప్రజా సమస్యలపై నిలదీసే మంచి స్వభావం ఉన్న వ్యక్తి నోముల నర్సింహయ్య. క్వార్టర్స్ లో ఎదురెదురు నివాసంలో ఉండేవాళ్లం. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా అసెంబ్లీలో  ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లం. 2004 నుంచి అయనతో ఏర్పడిన స్నేహం ఆయన చనిపోయే 4 గంటల ముందు కూడా నాతో మాట్లాడారు. ఎవరికీ భయపడకుండా బడుగు బలహీన వర్గాలు కోసం ఆయన పనిచేశారు. తెలుగు ప్రజలు, చేతి వృత్తుల పనివారు వారిని మరచిపోలేరు. మరి కొంత కాలం ఆయన జీవించి ఉంటే పేద ప్రజలకు మరింత మేలు జరిగేది’ అని కిషన్‌రెడ్డి గత స్మృతులను జ్ఞాపకం చేశారు.

Updated Date - 2020-12-12T02:33:09+05:30 IST