ఓటుకు నోటు కేసులో ఉదయ్సింహా అరెస్టు
ABN , First Publish Date - 2020-12-17T09:07:38+05:30 IST
ఓటుకు నోటు కేసులో ఉదయ్సింహా అరెస్టు

హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఏ-3గా ఉన్న రుద్ర ఉదయ్సింహాను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. రాజకీయ నాయకులపై నమోదైన కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఓటుకు నోటు కేసులో విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర, సెబాస్టియన్ మంగళవారం విచాణకు హాజరయ్యారు. ఉదయ్సింహా హాజరు కాలేదు. మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దానిని తిరస్కరించిన న్యాయస్థానం.. ఉదయ్సింహాపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.