రెండు నెలల చిన్నారి కిడ్నాప్
ABN , First Publish Date - 2020-11-13T09:17:13+05:30 IST
రెండు నెలల చిన్నారి కిడ్నా్పకు గురైంది. 9గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు..
9గంటలల్లో కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ సిటీ/చార్మినార్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రెండు నెలల చిన్నారి కిడ్నా్పకు గురైంది. 9గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు.. బిడ్డను తల్లి చెంతకు చేర్చారు. షేక్ బషీర్, భార్య సుల్తానా, ఇద్దరు పిల్లలు.. ఫరూక్నగర్లోని ఒక ఫుట్పాత్పై నివాసం ఉంటున్నారు. రాత్రి అక్కడే పడుకున్న వారు.. తమ బిడ్డ లేకపోవడాన్ని తెల్లవారుజామున గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అర్ధరాత్రి సమయంలో ఓ ఆటోలో వచ్చిన కొంతమంది ఆ బిడ్డను తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. తక్షణమే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. సలామి ఆస్పత్రి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ఆటోను ఆపి విచారించారు.
వట్టేపల్లి ప్రాంతానికి చెందిన సయ్యద్ సాహిల్, అతని భార్య జబీన్ ఫాతిమా, ఆమె సోదరి ఫాతిమాను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసింది వారేనని నిర్ధారించుకున్నారు. వారి వద్ద నుంచి బిడ్డను తీసుకుని తల్లికి అప్పగించారు.