ఛత్తీ్‌సగఢ్‌లో ఇద్దరు మహిళా నక్సల్స్‌ హతం

ABN , First Publish Date - 2020-12-29T07:38:26+05:30 IST

ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. దంతెవాడ జిల్లాలో కిరండుల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పోరోక్కడి అటవీ ప్రాంతంలో పోలీసులు

ఛత్తీ్‌సగఢ్‌లో ఇద్దరు మహిళా నక్సల్స్‌ హతం

దుమ్ముగూడెం, డిసెంబరు 28: ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. దంతెవాడ జిల్లాలో కిరండుల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పోరోక్కడి అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మృతి చెందిన మహిళా నక్సల్స్‌ను మండవి ఐతే, మరకం విజ్జేలుగా గుర్తించారు. వారిపై రూ.7లక్షల రివార్డు ఉంది.

Updated Date - 2020-12-29T07:38:26+05:30 IST