LIVE....తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం

ABN , First Publish Date - 2020-05-13T13:10:53+05:30 IST

LIVE....తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం

LIVE....తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడుకు సంబంధించిన వివాదం నడుస్తోంది. పోతిరెడ్డిపాడు అంశానికి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణ కనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోలేదనే ఆరోపణ తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తోంది. టీ సర్కార్ ఇప్పటికే దీనిపై కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మానవతా దృక్పథంతో దీన్ని చూడాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తమకు రావాల్సిన నీటి కంటే ఒక చుక్క నీటిని కూడా ఎక్కువగా తీసుకోబోమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రెండు రాష్ట్రాలు తమ తమ నిర్ణయాలపై పట్టుదలగా ఉన్నాయి. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చేపట్టిన చర్చలో రిటైర్డ్ ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ శ్యాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ నేత సంపత్, ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-13T13:10:53+05:30 IST