టీఎస్–బిపాస్ మంత్రి వర్గం ఆమోదం తర్వాతే ఆచరణలోకి వస్తుంది: పురపాలక శాఖ
ABN , First Publish Date - 2020-05-31T01:33:22+05:30 IST
టీఎస్–బిపాస్ మంత్రి వర్గం ఆమోదం తర్వాతే ఆచరణలోకి వస్తుంది: పురపాలక శాఖ
![టీఎస్–బిపాస్ మంత్రి వర్గం ఆమోదం తర్వాతే ఆచరణలోకి వస్తుంది: పురపాలక శాఖ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: టీఎస్-బిపాస్ ట్రయల్ మాత్రమే అని, రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తర్వాతే ఆచరణలోకి వస్తుందని పురపాలక శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం–2019 లోబడి స్థానిక సంస్థలకు(మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు) ఇచ్చిన అధికారాలలో భాగంగా పట్టణ ప్రణాళికలు, భవన నిర్మాణ అనుమతులు, లేఔట్ అనుమతులు స్థానిక సంస్థలే నిర్వహిస్తాయని పురపాలక శాఖ తెలిపింది.
జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి రావాల్సిన టీఎస్–బిపాస్ విధానాన్ని రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తర్వాత ఆచరణలో అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. అప్పటి వరకు(ప్రస్తుతం) టీఎస్–బిపాస్ ప్రక్రియ ప్రయోగాత్మకంగా(ట్రయల్ టెస్టింగ్) కొనసాగుతుందని పేర్కొంది. టీఎస్–బిపాస్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్(సాఫ్ట్ వేర్ అప్లికేషన్) పురోగతిలో ఉందని, వివిధ ప్రభుత్వ విభాగాల(శాఖల) మధ్య అనుసంధాన ప్రక్రియతో పాటు ప్రభుత్వ స్థలాలు, నిషేదిత సర్వే నెంబర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచే ప్రక్రియ ఇంకా పురోగతిలో ఉందని పురపాలక శాఖ తెలిపింది.