14న సర్కారుపై పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం
ABN , First Publish Date - 2020-08-12T09:26:47+05:30 IST
14న సర్కారుపై పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం

కరోనా కట్టడిలో విఫలమైంది: విపక్షాలు.. కోదండ అధ్యక్షతన భేటీ
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆందోళనల కోసం ఈ నెల 14న కార్యాచరణ ప్రకటించనున్నట్లు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలవేదిక ప్రతినిధులు చెప్పారు. మంగళవారం ఎంబీ భవన్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో జరిగిన ఓ సమావేశంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమాక్రసీ నేత గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి సమర్థంగా చర్యలు తీసుకోని ప్రభుత్వ తీరుపై మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు చెప్పారు.