ఇక ఎంసీఏ రెండేళ్లే.. ఈ ఏడాదే అమల్లోకి
ABN , First Publish Date - 2020-07-08T08:59:58+05:30 IST
ఇక ఎంసీఏ రెండేళ్లే.. ఈ ఏడాదే అమల్లోకి
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించినట్లు ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మంగళవారం తెలిపింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అన్ని మాస్టర్ కోర్సుల మాదిరిగానే ఎంసీఏ కోర్సు వ్యవధిని కూడా రెండేళ్లకు కుదించాలనే ప్రతిపాదనకు గత ఏడాది యూజీసీ ఆమోదం తెలిపింది.