కబ్జాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ABN , First Publish Date - 2020-12-11T04:49:04+05:30 IST
అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతూ, వారి అవినీతి, అక్రమాల గుట్టురట్టు చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మండిపడ్డారు.

కబ్జాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి
ఆత్మకూరు, డిసెంబరు 10: అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతూ, వారి అవినీతి, అక్రమాల గుట్టురట్టు చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మండిపడ్డారు. గురువారం కొత్తగట్టులో బీజేపీలోకి భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జర్నలిస్టులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. డబుల్ బెడ్రూంలు, దళితులకు మూడు ఎకరాలు, నిరుద్యోగ భ్రుతి, రైతులకు మద్దతు ధర కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడుకొండేటి శ్రీధర్, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టరు పెసరు విజయ్చందర్రెడ్డి, మండల అధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొన్నారు.
ఫ అక్కంపేటలో జరిగిన మరో కార్యక్రమంలో పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ సమక్షంలో గురువారం బీజేపీలో చేరారు. కొండేటి మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతల మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్గౌడ్, పరకాల కార్పొరేటర్ జయంతిలాల్, జిల్లా ప్రొటోకాల్ కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు నదానందం తదితరులు పాల్గొన్నారు.