‘గ్రేటర్’లో బ్యాలెట్కే పార్టీల ఓటు!
ABN , First Publish Date - 2020-10-01T08:47:45+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్తో నిర్వహించాలా? ఈవీఎంలతోనా? అనే అంశంలో రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎన్నికలను....
టీఆర్ఎస్, ఎంఐఎం, టీడీపీ, వామపక్షాల మొగ్గు
ఈవీఎంల వైపు బీజేపీ
శాస్ర్తీయంగా అధ్యయనం చేయాలన్న కాంగ్రెస్
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్తో నిర్వహించాలా? ఈవీఎంలతోనా? అనే అంశంలో రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలన్న విషయంలో 30వ తేదీ లోపు తమ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా పార్టీలకు ఎన్నికల సంఘం గడువు విధించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ పార్టీలు బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. కరోనాకు ముందు కూడా టీడీపీ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తని విధంగా శాస్ర్తీయంగా అధ్యయనం చేయించి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ కోరగా.. ఈవీఎంలతో నిర్వహించడమే మంచిదని బీజేపీ సూచించింది. కాగా, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైన తర్వాతే దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని ఎన్నికల కమిషనర్ పార్థసారధి అన్నారు.