మంద కృష్ణకు నేనే ప్రత్యామ్నాయం: పిడమర్తి

ABN , First Publish Date - 2020-08-15T09:32:03+05:30 IST

ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ స్వస్తి పలికారని ..

మంద కృష్ణకు నేనే ప్రత్యామ్నాయం: పిడమర్తి

హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ స్వస్తి పలికారని టీఆర్‌ఎస్‌ నేత, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. రాజ్యాధికారం సాధిస్తానని, టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌కు తానే ప్రత్యామ్నాయం అని ఆయన చెప్పుకొంటున్నారని విమర్శించారు. మంద కృష్ణకు తానే ప్రత్యామ్నాయం శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. పార్టీలు పెట్టి ఎన్నికలకు ముందు మాయవడం మంద కృష్ణకు పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు.  


Updated Date - 2020-08-15T09:32:03+05:30 IST