తాగాడు... మైకంలో నిప్పంటించుకున్నాడు
ABN , First Publish Date - 2020-08-12T19:31:56+05:30 IST
పీకల దాకా తాగాడు. ఆ మైకంలో ఆత్మహత్య చేసుకోబోయాడు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెయింటర్గా పనిచేస్తున్న స్వామి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

నిజామాబాద్ : పీకల దాకా తాగాడు. ఆ మైకంలో ఆత్మహత్య చేసుకోబోయాడు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెయింటర్గా పనిచేస్తున్న స్వామి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
తాగిన మత్తులో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూనే... తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటి మీద పోసుకోని నిప్పంటించుకున్నాడు స్వామి. వెంటనే స్పందించిన స్థానికులు... మంటలను అర్పివేశారు.
గాయాలైన స్వామిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా... స్వామి కిందటి సంవత్సరం కూడా... తాగిన మైకంలో అంగడి బజార్లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.