పారదర్శకంగానే పదోన్నతులు: సునీల్శర్మ
ABN , First Publish Date - 2020-02-12T10:06:21+05:30 IST
రవాణాశాఖలో బదిలీలు, పదోన్నతుల్లో ఎవరి ప్రమేయం ఉండదని, పారదర్శకంగానే
![పారదర్శకంగానే పదోన్నతులు: సునీల్శర్మ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రవాణాశాఖలో బదిలీలు, పదోన్నతుల్లో ఎవరి ప్రమేయం ఉండదని, పారదర్శకంగానే జరుగుతాయని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇన్చార్జి కమిషనర్ సునీల్శర్మ అన్నారు. ‘క్యాష్ కొట్టు.. పోస్టింగ్ పట్టు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. సాలూర చెక్పోస్టులో సిబ్బంది కొరత వల్ల కామారెడ్డి చెక్పోస్టు నుంచి సిబ్బంది రొటేషన్ పద్ధతిలో పనిచేస్తున్నారని వివరించారు.