రేపు అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2020-06-02T00:41:16+05:30 IST

మంగళవారం అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ఉదయం

రేపు అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: మంగళవారం అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ఉదయం 8:30 గంటలకు సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. రాజభవన్ రోడ్‌, నిరంకారి, ఖైరతాబాద్‌ వీవీ స్టాచ్యూ, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, రవీంద్రభారతి జంక్షన్‌, నాంపల్లి ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిపివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-06-02T00:41:16+05:30 IST