ఢిల్లీ రైతులకు టీపీసీసీ మద్దతు: పొన్నం
ABN , First Publish Date - 2020-12-01T08:46:17+05:30 IST
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు టీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులపై లాఠీచార్జీని తీవ్రంగా

హైదరాబాద్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు టీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి చేసే పార్టీకే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలను ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ కోరారు. టీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికార పార్టీకి అటెండర్గా మారారని విమర్శించారు.