నేడే ఎంజేపీ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2020-09-30T06:33:58+05:30 IST
మహాత్మ జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) తెలంగాణ బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం పరీక్ష
వరంగల్ అర్బన్ ఎడ్యుకేషన్, సెప్టెంబరు 29: మహాత్మ జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) తెలంగాణ బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం పరీక్ష జరుగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంజేపీ ప్రాంతీయ సమన్వయ అధికారి వై. మనోహర్రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,171 మంది విద్యార్థులు ఎంజేపీటీబీసీ గురుకుల కళాశాల ప్రవేశ పరీక్ష రాయనున్నట్లు మనోహర్రెడ్డి పేర్కొన్నారు.