ఉద్యోగులకు అండగా ఉంటా..టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్
ABN , First Publish Date - 2020-10-27T11:26:22+05:30 IST
వరంగల్ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ అన్నారు.
కేయూ క్యాంపస్, అక్టోబరు 26: వరంగల్ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ అన్నారు. కేయూ అతిథి గృహంలో కేయూ ఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.ఎల్లయ్య, వల్లాల తిరుపతి ఆధ్వర్యంలో ప్రతాప్, కారం రవీందర్రెడ్డిలను సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన అన్ని సదుపాయాలు అందేలా చూస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ గెజిటెట్ అధికారుల సంఘం కన్వీనర్ అన్నమనేని జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేశ్కుమార్గౌడ్, నేతలు లక్ష్మణ్రావు, రత్నవీరాచారి, కేయూ అడ్మినిస్ట్రేషన్ అధికారుల సంఘం అధ్యక్షకార్యదర్శులు సీహెచ్.ప్రణయ్కుమార్, పెండ్లి అశోక్బాబు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం బాధ్యులు మహ్మద్అబ్దుల్ షుకూర్, సీహెచ్.ప్రభాకర్, బి.చొక్కారావు, రవిశంకర్, బూర సత్యప్రకాశ్, శివశంకర్, కృష్ణవేణి, బుచ్చయ్య, సతీశ్బాబు, యూనస్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.