కోదండ సర్.. నాకు మద్దతివ్వండి: రాణి రుద్రమ
ABN , First Publish Date - 2020-10-13T09:49:32+05:30 IST
కోదండ సర్.. నాకు మద్దతివ్వండి: రాణి రుద్రమ
![కోదండ సర్.. నాకు మద్దతివ్వండి: రాణి రుద్రమ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఇల్లెందు, అక్టోబర్ 12: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మద్దతిచ్చి, బలపర్చాలని యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ కోరారు. సీఎం కేసీఆర్కు అమ్ముడుపోతున్న కొన్ని పార్టీల నాయకులను నమ్మి మోసపోవద్దన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమం సందర్భంగా విలేకరులతో రాణి రుద్రమ మాట్లాడారు.