నిజామాబాద్ జిల్లాలో పులి కలకలం
ABN , First Publish Date - 2020-05-09T23:49:37+05:30 IST
ఎడపల్లి మండలం అంబo గ్రామంలో పులి కలకలం సృష్టించింది.గ్రామంలోకి ప్రవేశించి కుక్కపై దాడి చేసింది. దీంతో స్థానికులు ..
![నిజామాబాద్ జిల్లాలో పులి కలకలం](https://media.andhrajyothy.com/appimg/galleries/202005090615052/05092020181630n3.jpg)
నిజామాబాద్: ఎడపల్లి మండలం అంబo గ్రామంలో పులి కలకలం సృష్టించింది.గ్రామంలోకి ప్రవేశించి కుక్కపై దాడి చేసింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పులి దాడి చేసిన కుక్కను పరిశీలించారు. అడుగుల ఆధారంగా పులి సంచరించినట్లు నిర్ధారించారు. గ్రామంలోని సీసీ పుటేజీ ఆధారంగా పులిని పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.