చిట్టీల పేరిట మోసం.. ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-27T12:22:00+05:30 IST

చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారం పేరుతో పలువురి నుంచి సుమారు

చిట్టీల పేరిట మోసం.. ముగ్గురి అరెస్టు

హైదరాబాద్/హైదర్‌ నగర్‌ : చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారం పేరుతో పలువురి నుంచి సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా తప్పించుకుతిరుగుతున్న కుటుంబాన్ని కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ లక్ష్మినారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దుద్దిపట్ల గ్రామానికి చెందిన చేగొండి సూర్యనారాయణ, అతని భార్య కనకదుర్గ, కూతురు మాధురి కేపీహెచ్‌బీ కాలనీ జీపీఆర్‌ ఎస్టేట్స్‌లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.


స్థానికంగా ఉండే చిరువ్యాపారులు, ఉద్యోగులతో పరిచయాలు పెంచుకుని వారి నుంచిచిట్టీల పేరుతో డబ్బు వసూలు చేశారు. మొదట డబ్బులు సక్రమంగా చెల్లించడంతో పలువురు పెద్ద మొత్తంలో చిట్టీలు వేశారు. అనంతరం గడువు ముగిసినప్పటికీ చీటీ పాటపాడిన వారికి డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 38మంది నుంచి సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా తప్పించుకుతిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Updated Date - 2020-12-27T12:22:00+05:30 IST