రాజేంద్రనగర్లో వరుస చోరీలు..
ABN , First Publish Date - 2020-09-16T15:18:31+05:30 IST
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధి హైదర్ గూడలో అర్థరాత్రి వరుస చోరీలు జరుగుతున్నాయి.

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధి హైదర్ గూడలో అర్థరాత్రి వరుస చోరీలు జరుగుతున్నాయి. వెంకటసాయి అపార్ట్మెంట్లోని మూడు ఫ్లాట్లలో దొంగతనం జరిగింది. పక్క ఫ్లాట్లకు ముందుగా తాళాలు వేసి చోరీకి పాల్పడ్డారు. పలు ఫ్లాట్ల వాసులు లాక్డౌన్ కారణంగా తమ సొంతూర్లకు వెళ్లారు. సుమారు 45 తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు విలువైన వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.