విద్యుత్తు ఉద్యోగుల విభజనపై.. రేపు సుప్రీం తుది తీర్పు
ABN , First Publish Date - 2020-12-06T08:05:58+05:30 IST
తెలుగు రాష్ట్రాల మధ్య ఐదున్నరేళ్లుగా నడుస్తున్న విద్యుత్తు ఉద్యోగుల విభజన వివాదం ఈ

తెలుగు రాష్ట్రాల మధ్య ఐదున్నరేళ్లుగా నడుస్తున్న విద్యుత్తు ఉద్యోగుల విభజన వివాదం ఈ నెల 7న ముగిసే అవకాశముంది. సుప్రీం కోర్టు ఈ మేరకు సోమవారంనాడు తుది తీర్పు చెప్పనుంది.
జస్టిస్ డీఎం ధర్మాధికారి ఆదేశాలపై తెలంగాణ విద్యుత్తు సంస్థలు సుప్రీం కోర్టులో క్లారిఫికేషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ తీర్పు ఆధారంగా రెండు రాష్ట్రాల విద్యుత్తు ఉద్యోగుల సీనియారిటీ వివాదం కూడా పరిష్కారం కానుంది.