రెండవ రోజు స్థంభించిన జన జీవనం
ABN , First Publish Date - 2020-03-23T14:38:21+05:30 IST
జిల్లాలో రెండవ రోజు జన జీవనం స్థంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో..

సంగారెడ్డి: జిల్లాలో రెండవ రోజు జన జీవనం స్థంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో నిత్యావసరాల కోసం జనం పరుగులు తీస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. సంగారెడ్డిలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల రేట్లు రెట్టింపు అయ్యాయి. కూరగాయలు కొనలేకపోతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.