భారత్‌లో పెరుగుతున్న ఐబీడీ సమస్య

ABN , First Publish Date - 2020-05-19T10:30:29+05:30 IST

భారత్‌లో ఇన్‌ఫ్లెమేటరీ బొవెల్‌ వ్యాధి(ఐబీడీ) బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నా

భారత్‌లో పెరుగుతున్న ఐబీడీ సమస్య

ప్రభుత్వం మార్గదర్శకాల రూపొందించాలి: నిపుణులు


న్యూఢిల్లీ, మే 18: భారత్‌లో ఇన్‌ఫ్లెమేటరీ బొవెల్‌ వ్యాధి(ఐబీడీ) బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు  ప్రధానకారణమని వారు చెబుతున్నారు. మంగళవారం ప్రపంచ ఐబీడీ అవగాహన దినోత్సవం సందర్భంగా నిపుణులు ఆ వ్యాధి గురించి వివరించారు. కడుపులో మంట, వాంతులు, విరేచనాలు, మలద్వారంలో రక్తం వంటి సూచనలన్నీ ఐబీడీకి చెందినవేనని, ఈ వ్యాధి తీవ్రత గురించి భారతీయులకు అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐబీడీ ఉన్న రోగులు, రెండుమూడేళ్లపాటు వివిధ వైద్యుల వద్దకు తిరిగిన తర్వాత గానీ ఐబీడీ ఉందని తెలుసుకోలేకపోతున్నారని, ఈలోపు వ్యాధి ముదిరిపోతోందని వివరించారు.


ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్దిష్ట మార్గదర్శకాలను ఏర్పాటుచేసి, వ్యాధి చికిత్సలో ఖర్చును తగ్గించేలా చూడాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఐబీడీపై మరిన్ని పరిశోధనలు జరగాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. ఆసియాలో భారత్‌లోనే అత్యంత ఎక్కువగా ఐబీడీ వ్యాధిగ్రస్తులున్నారని, ముఖ్యంగా 20-30 ఏళ్ల మధ్యవారు దాని బారిన పడుతున్నారని వివరించారు.

Updated Date - 2020-05-19T10:30:29+05:30 IST