లాక్‌డౌన్‌ను పట్టించుకోని ప్రజలు..పోలీసుల జరీమానా..

ABN , First Publish Date - 2020-04-01T20:32:51+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా..

లాక్‌డౌన్‌ను పట్టించుకోని ప్రజలు..పోలీసుల జరీమానా..

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో వాహనదారులకు పోలీసులు చలానాలు విధిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఒక్క హైదరాబాద్‌లోనే 1,45,000 మంది నిబంధనలు ఉల్లంఘించారు. వారికి పోలీసులు జరిమానాలు విధించారు. మరికొంత మంది వాహనాలు సీజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అత్యవసరపరిస్థితిలో ఉన్నవాళ్లకు మాత్రమే ఇచ్చిన మినహాయింపును తప్పుదోవపట్టిస్తూ.. రోడ్డుపైకి వచ్చినవారిని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడిచేస్తున్నారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు ప్రయాణించకూడదన్న నిబంధనను తుంగలోతొక్కిన వారికి కూడా పోలీసులు భారీగా చలానాలు విధిస్తున్నారు.

Updated Date - 2020-04-01T20:32:51+05:30 IST