హైదరాబాద్: పాతబస్తీ మొత్తం నిర్మానుష్యం
ABN , First Publish Date - 2020-04-28T21:21:43+05:30 IST
రంజాన్ వస్తూనే భాగ్యనగరం కొత్త అందాన్ని కొనితెచ్చుకుంటుంది.

హైదరాబాద్: రంజాన్ వస్తూనే భాగ్యనగరం కొత్త అందాన్ని కొనితెచ్చుకుంటుంది. పండుగ సందడి మొత్తం పాత బస్తీకి షిప్ట్ అవుతుంది. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతమైతే రంజాన్ నెలపాటు ఎగ్జిబిషన్లా మారిపోతుంది. పొద్దంతా లాడ్ బజార్ రంగుల గాజులు, సాయంత్రం రాత్ బజార్ వెలుగులతో పాతబస్తీ మొత్తం కాంతులీనుతుంది. కొన్ని శతాబ్దాలుగా అదే జరుగుతోంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆ మెరుపులు లేవు. కరోనా దెబ్బకు పాతబస్తీ మొత్తం నిర్మానుష్యంగా మారింది.
చార్మినార్ ప్రాంతంలో ఇప్పుడు చూద్దామంటే మనిషే కరువయ్యాడు. రంజాన్ నెల ప్రారంభమైన మొదలు.. పాతనగరం మొత్తం జనంతో కలకలలాడేది. చార్మినార్, మక్కా మసీదు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో జిగేల్మనేవి. రాత్రిపూట అక్కడి అందాల్ని చూసేందుకు ట్విన్ సిటీస్ క్యూ కట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా వాటన్నింటిని కనుమరుగు చేసింది.