పార్టీ మారే వార్త నిజం కాదు

ABN , First Publish Date - 2020-12-06T07:54:26+05:30 IST

తాను పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియా, కొన్ని న్యూస్‌ చానళ్లలో వస్తున్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి తెలిపారు.

పార్టీ మారే వార్త నిజం కాదు

జానా తనయుడు రఘువీర్‌రెడ్డి

నల్లగొండ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తాను పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియా, కొన్ని న్యూస్‌ చానళ్లలో వస్తున్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం తన మొబైల్‌ ద్వారా మీడియా ప్రకటన విడుదల చేశారు.

సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోయిన రోజు నుంచే ఉప ఎన్నిక, గెలుపుపై వివిధ పార్టీల నేతలు విష ప్రచారానికి తెరతీయడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే సంతాప దినా లు ముగిసే వరకు రాజకీయాలను పక్కన పెడదామని సూచించారు. జానారెడ్డి ఆశయ సాధన కోసం తాను ముందుకు సాగుతానని, విలువలు కలిగిన రాజకీయాలతోనే తన ప్రయాణం ఉంటుందన్నారు.


Updated Date - 2020-12-06T07:54:26+05:30 IST