పట్టు తప్పినా.. ప్రాణం నిలిపారు!

ABN , First Publish Date - 2020-03-08T11:08:15+05:30 IST

సునీల్‌.. కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు. కల్లుగీసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

పట్టు తప్పినా..  ప్రాణం నిలిపారు!

సునీల్‌.. కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు. కల్లుగీసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం తాటిచెట్టు ఎక్కాడు. హఠాత్తుగా అతనికి ఫిట్స్‌ రావడంతో పట్టుతప్పి కొద్దిదూరం జారి తలకిందులుగా వేలాడాడు. గమనించిన తోటి కార్మికులు ఏడుగురు తాటిచెట్టుపైకి ఎక్కారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో కిందకు దించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ప్రస్తుతం సునీల్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

 కాగజ్‌నగర్‌ 

Updated Date - 2020-03-08T11:08:15+05:30 IST