నూతన వధూవరుల చప్పట్లు
ABN , First Publish Date - 2020-03-23T09:16:49+05:30 IST
వరంగల్రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటలో వివాహం చేసుకొని కీర్తినగర్కాలనీకి ఎటువంటి ఊరేగింపు లేకుండా ఆదివారం వధూవరులు అరవింద్, సురేఖలు చేరుకున్నారు.

గీసుగొండ, మార్చి 22: వరంగల్రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటలో వివాహం చేసుకొని కీర్తినగర్కాలనీకి ఎటువంటి ఊరేగింపు లేకుండా ఆదివారం వధూవరులు అరవింద్, సురేఖలు చేరుకున్నారు. ఈ క్రమంలో సమయం 5 గంటలు కావటంతో కొత్తజంటతోపాటు వారి బంధువులు వాహనం దిగి జనతా కర్ఫ్యూకు, కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు మద్దతుగా చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు.