బీజేపీ నేతలే మాపై దాడికి యత్నించారు

ABN , First Publish Date - 2020-09-14T09:29:14+05:30 IST

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌) వద్ద బీజేపీ నేతలు అత్యుత్సాహంతో తమపై దాడి

బీజేపీ నేతలే మాపై దాడికి యత్నించారు

  • ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ను బీజేపీ ఆఫీసుగా మార్చేశారు:ఎంపీ వెంకటేశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌) వద్ద బీజేపీ నేతలు అత్యుత్సాహంతో తమపై దాడి చేయడానికి యత్నించారని టీఆర్‌ఎస్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత ఆరోపించారు. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌తో కాలుష్యం బారిన పడే రెండు గ్రామాల ప్రజలు కేంద్ర మంత్రులకు నిరసన తెలిపారని, వాళ్ల తరఫున తాము కూడా హాజరయ్యామని తెలిపారు. ఈ గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సిందేనని డిమాండ్‌ చేశారు.  తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో సమీక్ష చేసేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు కర్మాగారాన్ని బీజేపీ కార్యాలయంలా మార్చేశారని, ప్రోటోకాల్‌ పాటించలేదని అన్నారు.  

Updated Date - 2020-09-14T09:29:14+05:30 IST