పారదర్శకంగా టెస్కాబ్ టెండర్ల ప్రక్రియ
ABN , First Publish Date - 2020-10-27T09:19:56+05:30 IST
పారదర్శకంగా టెస్కాబ్ టెండర్ల ప్రక్రియ
![పారదర్శకంగా టెస్కాబ్ టెండర్ల ప్రక్రియ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
‘ఆంధ్ర జ్యోతి’ కథనంపై ఎండీ మురళీధర్ స్పందన
తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు(టెస్కాబ్)లో సాంకేతిక పనుల అభివృద్ధి కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కొనసాగుతోందని ఆ సంస్థ ఎండీ నేతి మురళీధర్ తెలిపారు. టెస్కాబ్లో ‘టెక్నికల్ దోపిడీ’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. డీసీసీబీల్లో సాంకేతిక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, దానిని సరిచేసేందుకే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గడిచిన 18 ఏళ్లుగా టెస్కాబ్లో వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ టెక్నాలజీనే డీసీసీబీలకు కూడా వినియోగించాలనే ఆలోచన ఉన్నట్లు ఎండీ తెలిపారు. అయితే ఏజెన్సీ ఎంపిక మాత్రమే జరిగిందని, ఇంతవరకు రూ.25 కోట్ల నిధులు విడుదల చేయలేదని మురళీధర్ అన్నారు.