క్వారంటైన్ను తప్పించుకుని రైలెక్కిన జంట.. కాజీపేటలో టెన్షన్ టెన్షన్
ABN , First Publish Date - 2020-03-21T18:14:11+05:30 IST
వరంగల్: విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన జంట క్వారంటైన్ను తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుంది.
![క్వారంటైన్ను తప్పించుకుని రైలెక్కిన జంట.. కాజీపేటలో టెన్షన్ టెన్షన్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032112423794/03212020124405n97.jpg)
వరంగల్: విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన జంట క్వారంటైన్ను తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుంది. అక్కడ హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ను ఎక్కింది.
విషయాన్ని గ్రహించిన ఎయిర్ పోర్టు అధికారులు.. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సదరు జంట హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు.. దానిని కాజీపేటలో నిలిపివేశారు. అనుమానిత జంటను దింపి ఎంజీఎంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.