హైదరాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రెయిన్‌ డీపీఆర్‌కు టెండర్లు

ABN , First Publish Date - 2020-11-03T08:18:34+05:30 IST

హైదరాబాద్‌-పుణె-ముంబై మధ్య ప్రారంభించబోయే బుల్లెట్‌ ట్రెయిన్‌ డీపీఆర్‌ తయారీ బిడ్లను ఈ నెల

హైదరాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రెయిన్‌ డీపీఆర్‌కు టెండర్లు

 18న తెరచుకోనున్న బిడ్లు, 5న ప్రీబిడ్‌ భేటీ

 బుల్లెట్‌ ట్రెయిన్‌తో 3.50 గంటల్లోనే ముంబైకి..

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-పుణె-ముంబై మధ్య ప్రారంభించబోయే బుల్లెట్‌ ట్రెయిన్‌ డీపీఆర్‌ తయారీ బిడ్లను ఈ నెల 18న తెరవనున్నారు. ప్రీబిడ్‌ సమావేశం ఈ నెల 5న జరగనుంది. రైల్వే బోర్డు ఆదేశానుసారం ఈ డీపీఆర్‌ తయారీకి నేషనల్‌ హై స్పీడ్‌ రెయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) టెండర్లను ఆహ్వానించింది.


గంటకు 320కిలో మీటర్ల వేగంతో పరుగెత్తే బుల్లెట్‌ ట్రెయిన్లను ఏడు కారిడార్లలో ప్రారంభించాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడింటికి ఎన్‌హెచ్‌ఎస్‌సీఆర్‌సీఎల్‌ డీపీఆర్‌లను తయారు చేయించనుంది. ఇందులో 711 కిలో మీటర్ల హైదరాబాద్‌-పుణె-ముంబై కారిడార్‌ ఒకటి. బుల్లెట్‌ ట్రెయిన్‌తో హైదరాబాద్‌-ముంబై మధ్య 3.50 గంటల్లోనే ప్రయాణించవచ్చు.

ప్రస్తుతం సగటున 80 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో వెళుతున్న రైళ్లలో హైదరాబాద్‌ నుంచి ముంబైకి ప్రయాణించాలంటే 13 గంటల సమయం పడుతుంది. బుల్లెట్‌ ట్రెయిన్‌తో ఏకంగా 9.50 గంటల సమయం తగ్గుతుంది. 


Updated Date - 2020-11-03T08:18:34+05:30 IST