తెలంగాణ పోలీసులను వెంటాడుతున్న కరోనా
ABN , First Publish Date - 2020-06-18T17:01:05+05:30 IST
తెలంగాణ పోలీసులను వెంటాడుతున్న కరోనా

హైదరాబాద్: తెలంగాణ పోలీసులను కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో నమోదు అయ్యింది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 22 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 9 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక క్రైంఎస్ఐ, ఏఎస్ఐ, ఏడు మంది కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అధిక సంఖ్యలో పోలీసులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో పోలీస్ యంత్రాంగంలో ఆందోళన నెలకొంది.