పొంగిపొర్లుతున్న వాగులను పరిశీలించిన మంత్రి
ABN , First Publish Date - 2020-08-16T00:37:36+05:30 IST
పొంగిపొర్లుతున్న వాగులను పరిశీలించిన మంత్రి
మహబూబాబాద్: వర్షాలు కారణంగా మహబూబాబాద్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఏటిగడ్డ తండా వాగు, మున్నేరు వాగు, జవాన్లపల్లి పొంగి రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి. మంత్రి సత్యవతి రాథోడ్ ఆ వాగుల వద్దకు వెళ్లి వరద తీరును పర్యవేక్షించారు. వరద రోడ్ల మీదకు రావడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు అధికారుల ద్వారా సాయం అందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు వాగులు, వంకల వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.