డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అమ్మితే నేరుగా జైలుకే: మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2020-05-17T21:44:36+05:30 IST
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అమ్మితే నేరుగా జైలుకే: మంత్రి హరీష్రావు

సిద్దిపేట: పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రావురూకుల, తోర్నాల గ్రామాల్లో నిర్మించిన 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని హరీష్రావు అన్నారు. ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అమ్మితే నేరుగా జైలుకు పంపుతామని హరీష్రావు హెచ్చరించారు.