తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
ABN , First Publish Date - 2020-11-03T21:25:58+05:30 IST
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఇంటర్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరుకాని 27,589 మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీరిలో మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన 338 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.