తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. సోమవారం ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-07-14T03:28:34+05:30 IST

తెలంగాణలో తాజాగా 1,550 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో సోమవారం 9 మంది చనిపోయారు. ఇప్పటివరకూ..

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. సోమవారం ఒక్కరోజే..

హైదరాబాద్‌: తెలంగాణలో తాజాగా 1,550 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో సోమవారం 9 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 36 వేల 221 కేసులు నమోదు కాగా 365 మంది చనిపోయారు. ఇంకా 11, 178 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా 1,197 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 23,679 మంది డిశ్చార్జి అయ్యారు. 


ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 926 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్ జిల్లాలో 53, సంగారెడ్డి జిల్లాలో 19, ఖమ్మం జిల్లాలో 38, కామారెడ్డి జిల్లాలో 33, వరంగల్ అర్బన్‌ జిల్లాలో 16, వరంగల్ రూరల్‌ జిల్లాలో 8,  నిర్మల్ జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 86, యాదాద్రి జిల్లాలో 5, మహబూబాబాద్ జిల్లాలో 13, పెద్దపల్లి జిల్లాలో 6, మెదక్ జిల్లాలో 6, మహబూబ్ నగర్ జిల్లాలో 13, మంచిర్యాల జిల్లాలో 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10, జయశంకర్ భూపాల్లి జిల్లాలో 6, నల్గొండ జిల్లాలో 41, సిరిసిల్ల జిల్లాలో 7, ఆదిలాబాద్ జిల్లాలో 1, వికారాబాద్ జిల్లాలో 3, నాగర్ కర్నూల్ జిల్లాలో 2, జనగాం జిల్లాలో 10, నిజామాబాద్ జిల్లాలో 8, వనపర్తి జిల్లాలో 1, సిద్దిపేట జిల్లాలో 10, సూర్యాపేట జిల్లాలో 10, గద్వాలజిల్లాలో 5 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 




Updated Date - 2020-07-14T03:28:34+05:30 IST