తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-05-30T03:42:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి అస్సలు తగ్గట్లేదు.

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి అస్సలు తగ్గట్లేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. దీంతో తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాదీలు భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్‌ కఠినంగా అమలులో ఉన్నా ఇలా కేసులు నమోదవుతుండటం గమనార్హం. శుక్రవారం నాడు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 169 పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం.


డిశ్చార్జ్, మరణాల లెక్కలివీ..

ఇందులో తెలంగాణకు చెందిన కేసులు 100 కాగా.. ఇతర రాష్ట్రాలు, సౌదీ నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 973, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,381గా ఉంది. ఇవాళ నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,008కి చేరుకుంది.


జిల్లాల వారిగా..

కాగా.. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌కు చెందిన కేసులే 82 ఉండటం నగరవాసులను కలవరపాటుకు గురిచేసే విషయం. రంగారెడ్డి జిల్లా-14, మెదుక్-02, సంగారెడ్డి-02 కేసులు నమోదయ్యాయి. వలస కూలీల్లో 05 కరోనా సోకింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 64 మంది మొత్తం 69 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఇవాళ కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 71 మంది కరోనా పోరాడి చనిపోయారు. వరంగల్ రూరల్, యాదాద్రి, వణపర్తిలో మాత్రం కేసులేమీ నమోదు కాలేదు. మరోవైపు కొన్ని జిల్లాలో గత 14రోజులుగా కొత్తకేసులేమీ నమోదు కాలేదు.



Updated Date - 2020-05-30T03:42:19+05:30 IST